రేపు రాజస్థాన్లో మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో నేడు భారీ అగ్నిప్రమాదం
- రాజస్థాన్ హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం
- ప్రధాని మోదీ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఘటన
- మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- ప్రమాదంలో ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన లేదు
- ప్రారంభోత్సవ కార్యక్రమంపై నెలకొన్న అనిశ్చితి
రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రాలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (ఏప్రిల్ 21) మంగళవారం ఈ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండగా, ఒక్కరోజు ముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా దీనిని నిర్మించారు. హెచ్పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ.79,459 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, గాయాలు గానీ అయినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.
రేపు జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై, జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన ఎల్పీజీ ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారని షెడ్యూల్ లో పేర్కొన్నారు. కార్యక్రమం కోసం సుమారు 5,000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన, రిఫైనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం యథాతథంగా జరుగుతుందా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్గా దీనిని నిర్మించారు. హెచ్పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ.79,459 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, గాయాలు గానీ అయినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.
రేపు జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరై, జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన ఎల్పీజీ ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారని షెడ్యూల్ లో పేర్కొన్నారు. కార్యక్రమం కోసం సుమారు 5,000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన, రిఫైనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం యథాతథంగా జరుగుతుందా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.